అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు కార్తీక దామోదర వ్రత పూజలను భక్తజనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు స్వామి ఆధ్వర్యంలో కార్తీక దామోదర వ్రత పూజలను భక్తులతో సామూహిక వ్రత పూజలను నిర్వహించిన అనంతరం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు.