ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పాత కందుకూరు,చింతకొమ్మదిన్నె, చింతకుంట గ్రామాల్లో ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి పర్యటించారు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ పనులను ఆమె స్వయంగా పరిశీలించారు, బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఏన్యూమరేషన్ ఫారాల పంపిణీ , డేటా డిజిటలేషన్ చేపడుతున్నట్లు తెలిపారు, ఓటర్లు అధికారులకు సహకరించి పాస్ పోర్టు సైజు ఫోటోలు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు