అనారోగ్య సమస్యతో పోస్టల్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగర శివారులోని మధుర నగర్ లో ఉరేసుకుని పోస్టల్ ఉద్యోగి గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తలపల్లి మండలం ఈదుల ముష్టురు గ్రామానికి చెందిన గోపీనాథ్ నగరంలోని మధురానగర్ లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడించారు.