కనిగిరి మండలంలోని చిన్న ఇర్లపాడు గ్రామంలో కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గురువారం రాత్రి ఎస్సై శ్రీరామ తో కలిసి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి గ్రామస్తులతో మాట్లాడుతూ.... సైబర్ నేరాల పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు సెల్ ఫోన్లకు పంపే లింకులను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని, అలా చేస్తే సైబర్ నేరగాళ్లు బ్యాంకుల్లో నగదును కాజేస్తారని హెచ్చరించారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.