పాణ్యం గ్రామానికి చెందిన మాజీ మండలాధ్యక్షుడు స్వర్గీయ పీవీ జగన్నాథరావు తల్లి శతాధిక వృద్ధురాలు పీవీ జనకజాబాయి(104) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగుళూరులో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే ఆమె వయస్సు 25 ఏళ్లకు పైగా ఉంటాయని గ్రామస్థులు తెలిపారు. శతాధిక వృద్ధురాలు జనకజాబాయి మృతి పట్ల పలువురు సంతాపం వెలిబుచ్చారు.