ఫరూఖ్నగర్ మండలం భీమారంలో ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళల గౌరవమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు