చిన్నమండెం మండలంలోని బోరెడ్డిగారిపల్లి గ్రామంలో మంగళవారం రాష్ట్ర రవాణా,యువజన,క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వయంగా స్వీకరించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను వెంటనే ఆదేశించారు. పలు ఫిర్యాదులకు ప్రత్యక్ష పరిష్కారం ఇవ్వడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు సహా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం. ప్రతి సమస్యకు తక్షణ స్పందనే మా ధ్యేయం అని మంత్రి అన్నారు.