స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి అన్నారు. షాద్నగర్లో మాట్లాడుతూ.. ఉద్యమకారులు లేనిది తెలంగాణను ఊహించలేమని, కాబట్టి ఉద్యమకారులను గుర్తించి సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల్లో అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేశారు