మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు బుధవారం అస్వస్థకు గురయ్యాడు. మంచాలమ్మ దేవి సన్నిధానం ముందు నిలబడ్డ భక్తుడు ఒక్కసారిగా కుప్పకూలి కిందకు పడిపోయాడు. అది గమనించిన తోటి భక్తులు అతడికి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం శ్రీ మఠం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే బ్యాటరీ వాహనంలో శ్రీ మఠం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.