ఇబ్రహీంపట్నం: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ అధికారులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ అధికారులు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాసబ్ చెరువు ప్రాంతంలో ఉన్న చెత్తను మొత్తం తొలగించారు. అనంతరం మున్సిపల్ అధికారులు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.