డోన్: మలేరియా రహిత భారతదేశం లక్ష్యం : డోన్ సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి
Dhone, Nandyal | Apr 25, 2026 వరల్డ్ మలేరియా డే సందర్భంగా 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం లక్ష్యంగా అవగాహన నిర్వహించినట్లు సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. డోన్లో ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మలేరియా జ్వరంపై అవగాహన కల్పించారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రత పాటించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చన్నారు. UPHC పాటపేట, రోకలి బండసత్రం కేంద్రాల్లో వైద్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించారు.