బుగ్గ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాయల చెరువుకు చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి రూరల్ మండల పరిధిలో ఉన్న బుగ్గ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యాడికి మండలం రాయల చెరువుకు చెందిన మోహన కుమార్ అనే యువకుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.