జగన్ మూడుముక్కలాట ఆడినందుకే ప్రజలు ఇంటికి పంపించారన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు :అహుడ చైర్మన్ టీసీ వరుణ్
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
జగన్ మూడుముక్కలాట ఆడినందుకే ప్రజలు ఇంటికి పంపించారన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని అహుడ చైర్మన్ టీసీ వరుణ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తూ కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిందన్నారు. జగన్ కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. మావిగన్ అనే పేరు పబ్జి గేమ్ ఆడుతూ తెరపైకి తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు ఎన్ని విమర్శలు చేసినా కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఎవరు ఆపలేరన్నారు.