మార్కాపురం జిల్లా పొదిలికొండపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరుణాల సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లాలోని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాలయ్య అధికారులు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రత్యేక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.