అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో బుధవారం 6 గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ సహాయ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి పిపిపి విధానాన్ని రద్దు చేయాలని జీవో కాపీలను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ సమితి పిలుపుమేరకు సనప గ్రామంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను భోగిమంటల్లో దహనం చేసి ప్రభుత్వానికి నిరసన తెలుపడం జరిగిందని ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిలిపివేయాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సిపిఐ సహాయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.