అనంతపురం జిల్లా గంగంపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని కనగానపల్లి మండలం గంగంపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో అనంతపురం రూరల్ మండల పరిధిలోని మనీలా గ్రామానికి చెందిన అయ్యప రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.