ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం ఉలిచి గ్రామం లో గ్రామ సభ నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 26, 2026
ఒంగోలు మండలం ఉలిచి గ్రామం లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గ్రామ సభ ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈరెవిన్యూ సదస్సు లక్ష్యమని శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి మొత్తం 37 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు – సరిహద్దులు, యాజమాన్య హక్కులు, వారసత్వ సమస్యలు, భూ రికార్డుల్లో తప్పులు ,పేర్లు సర్వే నంబర్లు, విస్తీర్ణంలో పొరపాట్లు, పట్టాదారు పాస్బుక్ సమస్యలు ,కొత్త పాస్బుక్ జారీ, సవరణలు, భూమి మ్యుటేషన్ పై అర్జీలు వచ్చాయి