ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలెక్టర్ విజయ సునీత
Ongole Urban, Prakasam | Jun 19, 2026
ఈనెల 27వ తేదీన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ విజయ సునీత ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిపాడ్ ప్రాంగణాలను సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. క్రిష్టం శెట్టిపల్లి లో సంజీవిని హాస్పిటల్స్ ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారని కలెక్టర్ విజయ సునీత మీడియాకు తెలిపారు. ఎటువంటి అవాంఛనమైన సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.