సదాశివనగర్: ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం, ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివనగర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుచున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగాలంటే పూర్తి అవగాహన ఉండాలని శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని పొరపాట్లు జరుగుతే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.