బనగానపల్లె: బాల కార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం : బనగానపల్లె జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బ్రహ్మానంద ఆచారి
బనగానపల్లె మండలం దేవనగర్ ప్రాథమిక పాఠశాలలో జేకేఆర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు జె.ఎస్.ఎస్. బ్రహ్మానంద చారి విద్యార్థులకు రాతపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారులతో పని చేయించడం చట్టరీత్యా నేరమని, ప్రతి చిన్నారికి విద్యనే బంగారు భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. హెచ్ఎం కే. కుర్షిద్ బేగం, 104 సిబ్బంది ఉన్నారు.