నందికోట్కూరు: తిరుపతిలో పారుమంచాల యువతి ఫ్లై ఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే యువతి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది, తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి కరకంబాడి లీలామహల్ సర్కిల్ మార్గంలో కిందకి దూకింది, చావు బతుకుల్లో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు, ఆదిలక్ష్మి తన అన్న స్వాములతో కలిసి తిరుపతికి వలస వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది