గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డు దస్తగిరి స్వామి జండా కట్ట విషయంలో జరిగిన ఘర్షణలో పోలీసులు సమగ్ర విచారణ జరపకుండా 24 మందిపై తప్పుడు కేసు నమోదు చేశారని విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల చట్టం జాతీయ నాయకుడు జాకీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మానవ హక్కుల ప్రొటెక్షన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 అక్టోబర్ 2025న మధ్యాహ్న సమయంలో ఒకే కుటుంబంలోని ఐదు మందిపై దాడి చేసి జండా కట్టకి వెళ్లే చిన్న గోడని పగలగొట్టారని పోలీసులు అన్యాయంగా 24 మందిపై కేసు నమోదు చేశారని అన్నారు.