తంబళ్లపల్లె మండలానికి చెందిన 14 ఏళ్ల బాలుడు చరణ్ అదృశ్యమైన కేసును అన్నమయ్య పోలీసులు విజయవంతంగా చేధించారు. కడప జిల్లా వేంపల్లి గండి ఆంజనేయస్వామి ఆలయం వద్ద చరణ్ సురక్షితంగా లభ్యమయ్యాడు.తంబళ్లపల్లె పోలీసులు అక్టోబర్ చివరి రోజున బాలుడు మిస్సింగ్ అయినట్లు కేసు నమోదు చేయగా, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.పోలీసులు చరణ్ ఫోటోతో సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టగా, ఓ భక్తుడు గండి ఆలయం వద్ద బాలుడిని గుర్తించి సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు చరణ్ను సురక్షితంగా రప్పించారు.