జన, కులగణన చేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయం: పట్టణంలో BJP ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దిలేటి
Dhone, Nandyal | May 4, 2025 కేంద్ర క్యాబినెట్ జనగణనతో పాటు కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కేసీ మద్దిలేటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం డోన్ పట్టణంలోని పాతబస్టాండు గాంధీ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు. కార్య క్రమంలో నాయకులు ఆర్మీ రామయ్య, దామోదర్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.