కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లంపేట వాసులకు సీఎం సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ అండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు కలుగుతుందని, అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.