నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆళ్లగడ్డ డిపో నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు, ఆళ్లగడ్డ నుంచి అహోబిలం టికెట్ ధర 40 40 రూపాయలుగా నిర్ణయించారు, భక్తుల కోసం డిపో వద్ద టెంట్లు, త్రాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు, నరసాపురం వద్ద అదనపు స్టాప్ సౌకర్యం కల్పించినట్లు అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీనివాసులు వివరించారు