నారాయణపేట్: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం
తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తాలో శుక్రవారం 10:30 గంటల సమయంలో వర్షం కురుస్తున్న కూడా గ్రామపంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. తమ యొక్క మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల మూడు నెలలు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.