నందికోట్కూరు: తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన, కలిసిన నందికొట్కూర్ సోషల్ మీడియా ప్రతినిధులు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం అమరావతి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియాకు చెందిన యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మాజీ సీఎం జగన్ ను కలిసిన వారిలో నందికొట్కూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులు మధు,వెంకటేష్,నాగరాజు, జూపాడుబంగ్లా-కళ్యాణ్, మిడుతూరు మండల సోషల్ మీడియా అధ్యక్షులు (కడుమూరు) షఫీ తదితరులు మాజీ ముఖ్యమంత్రి కలిశారు.ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియా ప్రతినిధులకు తెలిపినట్లు వారు అన్నారు.