విశాఖపట్నం: విశాఖ : డిసెంబర్ నుంచి వందే భారత్ వేళల్లో మార్పులు
సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (నం. 20707/20708) సర్వీసుల్లో మార్పులు చేసినట్లు విశాఖపట్నం రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం గురువారాల్లో నడుస్తున్న ఈ రైలు, డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రతి సోమవారం నడుస్తుంది.ప్రయాణికులు ఈ మార్పును గమనించి, తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ రైలు సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక రైల్వే వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా సంబంధిత రైల్వే అధికారులను సంప్రదించవచ్చన్నారు.