అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ భాషా, ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజవర్గం నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం అన్నారు. ప్రజల సమస్యలను పరిశీలించి త్వరాతగిన పరిష్కరించే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు