ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బారు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. సోమవారం కంభం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను వారి సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిశీలించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసిందని ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉందని