ఇబ్రహీంపట్నం: చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని సుమోటోగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వీకరణ
చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని సుమోటోగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) స్వీకరించింది. డిసెంబర్ 15లోపు నివేదిక సమర్పించాలని రవాణా, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు HRC ఆదేశించింది. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారిని నివేదిక పంపాలని హెచ్ఐర్సీ కోరింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీని నివేదిక పంపాలని ఆదేశించింది.