ఒంగోలు అర్బన్: డైవర్షన్ పాలిటిక్స్ లో నిన్నటి వరకు వెంకటేశ్వర స్వామిని , నేడు శివుడిని వాడుతున్నారు జాగ్రత్త : వైసీపీ జిల్లా అధ్యక్షుడు
Ongole Urban, Prakasam | Jun 14, 2026
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్నటి వరకు వెంకటేశ్వర స్వామిని వాడుకున్న కూటమినేతలు నేడు మహాశివుని పరమ పవిత్రమైన శ్రీశైలం దేవాలయాన్ని వాడుతున్నారని శివుడు చూస్తూ ఊరుకోడు అని తగిన ఫలితం తప్పదని వైసిపి జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హెచ్చరించాడు హిందూ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి సంబంధించిన కాటేజ్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని దమ్ముంటే నిరూపించాలని సవాలు విసిరారు శ్రీశైలం నుంచి నోటీసులు ఇచ్చారు అంటున్నారని నిజమైతే ఆ నోటీసు నకలను చూపిస్తే నేను మహా శివుని సన్నిధిలో క్షమాపణ చెప్తానన్నారు లేకుంటే మీరు చెప్పాలని హెచ్చరించారు