నంద్యాల జిల్లా బేతంచెర్ల-డోన్ రహదారిలో రెండు రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్యాక్టరీ కార్మికుడు ప్రహ్లాద (27) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ రహదారిలోని నాపరాళ్ల ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన పని నిమిత్తం మోటార్ సైకిల్ పై బేతంచెర్లకు వస్తుండగా ఘటన జరిగింది. రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.