అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారి అయిన కార్తీక్ రెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వడ్డీపల్లి సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువలో సరదాగా కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఈతకు దిగడంతో నీటి ఉధృతికి నీట మునిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు బంధువులు చూస్తుండగానే వైద్యాధికారి గల్లంతయ్యాడు. కాలువలో గల్లంతైన కార్తీకరెడ్డి కోసం పోలీసులు గజఈతగాళ్ళతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.