ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదం, కారు బైక్ను ఢీకొట్టడంతో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మృతి
Nandyal Urban, Nandyal | Apr 2, 2026
ఓర్వకల్లు మండలం కన్నమడకల సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రంగస్వామి (33) రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం విధులు ముగించుకుని బైక్పై కర్నూలుకు వెళ్తుండగా ఎయిర్పోర్టు వద్ద కారు వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.