రైతులందరికీ సమన్యాయం జరగడమే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలో రింగ్ రోడ్డులో భాగంగా భూములను కోల్పోతున్న రైతులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై నితిన్ గడ్కరితో కూడా మాట్లాడతానని స్పష్టం చేశారు. దీనిపై పోరాటానికి సిద్ధం అవుదామని, రాజీ పడే ప్రశ్న లేదన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.