భువనగిరి: ఈ నెల 22న బీబీనగర్లో జ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
ఈనెల 22న బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ఫేమస్ గార్డెన్లో జరగబోయే మాదిగ, మాదిగ ఉపకులాల జ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ కోరారు .ఈ సందర్భంగా శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు.