డోన్: బేతంచర్ల లోని ఓ హోటల్లో పేలిన ఫ్రిడ్జ్, తప్పిన ప్రమాదం
Dhone, Nandyal | May 1, 2026 నంద్యాల జిల్లా బేతంచర్లలోని మహబూబ్ హోటల్లో ఫ్రిడ్జ్ పేలింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. హోటల్ నుంచి భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు హోటల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో హోటల్లోని సామగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. పేలుడు సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.