ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం శక్తి యాప్ పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ని రూపొందించిందని పోలీసులు మహిళలకు తెలిపి స్మార్ట్ ఫోన్లో యాప్ లేని వారికి పోలీసులు డౌన్లోడ్ చేయించారు. ఆపద సమయంలో మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే వెంటనే వారి వద్దకు చేరుకొని మహిళలకు రక్షణ కల్పిస్తారని అన్నారు.