ఆళ్లగడ్డ: చాగలమర్రిలో అంగరంగ వైభవంగా లాల్ స్వామి పీర్ల ఊరేగింపు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో ప్రసిద్ధి చెందిన పీర్ల పండగ లో భాగంగా మొహర్రం 9వ రోజు అర్ధరాత్రి లాల్ స్వామి పీర్ల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు, కడప కర్నూలు నంద్యాల తదితర జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, సంప్రదాయ వాయిద్యాల నడుమ పట్టణ ప్రధాన వీధుల గుండా ఈ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు