సీఎం రిలీఫ్ ఫండ్తో నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని ఎమ్మెల్యే, PAC ఛైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. శనివారం వివేకానందనగర్ డివిజన్ వేంకటేశ్వరనగర్ కాలనీకి చెందిన సాయిలుకు అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 1,10,000 ఎల్దసీ మంజూరి పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.