కుప్పం: కంగుంది ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పెన్షన్ తో పాటు తిరుమల లడ్డు పంపిణీ
కుప్పం మండలంలోని కంగుంది ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతోపాటు తిరుమల లడ్డూను పెన్షనర్లకు అందజేశారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం పెన్షనర్ల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్తో పాటు తిరుమల శ్రీవారి లడ్డూను అందజేశారు. దీంతో పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పెన్షన్తో పాటు లడ్డు పంపించారని టీడీపీ నేతలు పెన్షనర్లకు చెప్పారు.