ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎన్జీవో కాలనీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసినదే. గ్రామీణ బ్యాంక్ క్యాషియర్ సత్యనారాయణ రెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. నెల కిందట ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లారు. అప్పటినుంచి ఆ ఇంట్లో టీవీ ఆన్ లోనే ఉంది. టీవీ వేడెక్కి మంటలు చెలరేగాయి. కిటికీల నుంచి పొగ రావడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.