ఆళ్లగడ్డ: గోవింద పల్లె గ్రామంలోని జగనన్న కాలనీలో, నవవధువు బావిలో దూకి ఆత్మహత్య
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లె గ్రామంలోని జగనన్న కాలనీలో వివాహిత వడ్డే అఖిల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది, ఆమెకు నెలరోజుల క్రితమే వివాహమైంది, గురువారం పుట్టింటి నుంచి వచ్చిన అనంతరం ఈ ఘటనకు పాల్పడింది, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, ఘటన స్థలానికి సిఐ రాము చేరుకొని పరిశీలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలము కున్నాయి