ఒంగోలు అర్బన్: ఒంగోలు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన బాలినేని, డిప్యూటీ సీఎం కోలుకుంటున్నారని వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉదయం బాలినేని ఒంగోలుకు వచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై కార్యకర్తలు ఆరా తీయడంతో ఆయన త్వరగా కోలుకుంటున్నారని భయపడవలసిన అవసరం లేదని కార్యకర్తలతో బాలినేని అన్నారు. సమావేశంలో స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.