కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ పరిధిలో బోరు మరమ్మతు కోసం పైపులు, కేబుల్ను బయటకు తీశారు. రాత్రి ఈ కేబుల్ చోరీకి గురైందని పంచాయతీ కార్యదర్శి రమ్యలక్ష్మి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లనూరు - వేపూరు మార్గంలోని RWS బోరు రిపేర్ కాగా మరమ్మతు చేసేందుకు పైపులు కేబుల్ బయటకు తీశారు. దొంగలు తీసుకెళ్లారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.