నంద్యాల అర్బన్: నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఇషాక్ భాషా
Nandyal Urban, Nandyal | Jun 12, 2026
'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' నినాదంతో నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉదయం శిల్పా రవి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన శ్రీనివాస్ సెంటర్ వరకు సాగింది. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వైసీపీ శ్రేణులతో నంద్యాల పురవీధులు దద్దరిల్లాయి.