పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం కొండంత భరోసానిచ్చి ఆదుకుంటుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డుకు చెందిన ఆండాలుకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ.2.50లక్షల చెక్కును ఎమ్మెల్యే అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని MLA పేర్కొన్నారు.