ఫరూఖ్నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు సందర్శించారు. హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని మానవతావాదులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల చెక్కును అందజేశారు.